శ్రీ మహా భాగవతము మనకు చాలా ముఖ్యమైన పురాణ గ్రంథము.వేదవ్యాసుడు ఈ గ్రంథాన్నిరచించాడు.శ్రీహరి గురించి ప్రముఖంగా ప్రస్తావన ఉంటుంది.ఇది చదివినా,విన్నా చాలా మంచిది.
భాగవతము స్కంధాలుగా విభజించ బడింది.ఇందులో పన్నెండు స్కంధాలు ఉన్నాయి.
విష్ణువు భగవంతుడు.అతని గురించి తెలియ చెప్పేదే భాగవతము.విష్ణువు సమస్తలోకాలనూ పాలిస్తాడు,పరిపాలిస్తాడు.అందరినీ రక్షించేదీ అతనే!అందరినీ పుట్టించేదీ,లాలించేదీ,చివరకు గట్టెక్కించేదీ అతనే!దుష్ట శిక్షణార్థం,శిష్ట రక్షణార్థం ప్రతి యుగంలో ఏదో ఒక రూపంలో ఆవిర్భవించేదీ అతనే!సామాన్యమైన మనకే కాదు,త్రిమూర్తులకు కూడా మూల కారణం అతడు.
No comments:
Post a Comment