Sunday, 12 July 2026
విదురుడి సంశయ నివృత్తి
మైత్రేయుడి మాటలు విదురుడి బుర్రలోకి బాగా ఎక్కాయి.తన మోదము ఇలా ప్రకటించాడు.ఓ మునీంద్రా!నాలో ఉండే చాలా అనుమానాలకు మీరు సమాధానం చెప్పారు.నాకు నారాయణుడు లోకానికి అంతటికీ ఏకైక నాయకుడు ఎలా అయ్యాడో బోథ పడింది.శరీర ధారులు అయిన జీవులకు కర్మ బంధములు ఎట్లా ఏర్పడతాయో అవగతమయింది.నేను ఇప్పుడు ఖరాఖండిగా చెప్పగలను...లోకములకు శ్రీహరి యే ప్రభువు అని.జీవుడు పరతంత్రుడు అనే విషయం తెలుసుకున్నాను.అజ్ఞానము,అవిద్య ఆ భగవంతుని యందలి భక్తి ప్రభావము చేతనే పటాపంచలు అవుతుంది.భగవంతుడు నిరాథారుడు..।కానీ సమస్త సృష్టికీ ఆయనే కారణభూతుడు.శరీరాభిమానము మానవుడుని మూఢుని చేస్తుంది.సంసారంలో గానుగెద్దు చందాన అక్కడక్కడే తిరిగేలా చేస్తుంది.కానీ ఏ క్షణాన భక్తి మార్గములోకి వస్తాడో,ఆ రోజు భగవంతుడికి దగ్గర అవుతాడు.సుఖాలకూ,దుఃఖాలకూ స్పందించడం మానకపోతే మానవుడు దుఃఖాల ఊబిలోనే కూరుకుపోతాడు.నారాయణుని భజన సమస్త దుఃఖాలకూ చరమ గీతం పాడుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
🙏
ReplyDelete