Wednesday, 21 January 2026
పరశురామ,రామావతార కథలు
హైహయవంశ రాజులు చెలరేగిపోయి లోకములను బాధించడం మొదలుపెట్టారు.వాళ్ళ అకృత్యాలకూ,కృూరత్వాలకూ అడ్డూ ఆపూ లేకుండాపోయాయి.
అప్పుడు విష్ణువు జమదగ్ని మహామునికి రాముడు అనే పేరుతో పుత్రుడుగా జన్మించాడు.పరశువును ధరించడం వలన పరశురాముడుగా ప్రసిద్ధికెక్కాడు.ఆ గండ్రగొడ్డలిని అతను శివుడునుంచి పొందాడు.
పరశురాముడు లోకకంటకులైన రాజులను ఇరవై ఒక్క సార్లు దాడి చేసి చంపాడు.ఆ సంహారాల అనంతరం వారి భూములను బ్రాహ్మణులకు ఇచ్చాడు.ఇది పరశురామావతారము.
శ్రీహరి దశరథునికి పుత్రునిగా జన్మించాడు. అతడు కోసల దేశ రాజు.శ్రీరాముడు అనే పేరుతో జన్మించాడు.భరత,లక్ష్మణ,శత్రుఘ్నులు అతని సోదరులు.శ్రీరాముడు శివధనుస్సును వించి జనక పుత్రిక అయిన సీతను వివాహము చేసుకున్నాడు.తండ్రి,పినతల్లి కోరిక మేర కానలకేగాడు.సీత,లక్ష్మణులు అతని వెంట వెళ్ళారు.ఆ అడవులలో క్రూరులైన రాక్షసులను చంపి,మునులకు అభయమిచ్చాడు.
ఖరదూషణులు రావణుని తమ్ముళ్ళు.వారి చెల్లెలు శూర్పణఖ రాముడుని మోహించి పెళ్ళి చేసుకోవాలనుకుంది.అప్పుడు ఆమె ముక్కుచెవులు లక్ష్మణుడు కోసివేస్తాడు.ఆ అవమానానికి ప్రతీకగా ఆమె సోదరులు పదునాలుగు వేలమంది రాక్షసులతో యుద్ధానికి వస్తారు రాముడు పైకి.రాముడు వారందరిని సంహారం చేస్తాడు.
సీతాన్వేషణలో భాగంగా సుగ్రీవుని మైత్రి అగ్ని సాక్షిగా కోరాడు.హనుమంతుడి సహాయంతో సీత జాడ కనుగొని,రావణ సంహారం చేసాడు.రావణుడి తమ్ముడు విభీషణుడిని లంకకు రాజును చేసాడు.
అయోధ్యకు సతీసమేతంగా వచ్చి రాజ్యానికి సుపరిపాలన అందించాడు.
ఇది శ్రీరామావతార కథ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment