Wednesday, 7 January 2026

మత్స్య,కూర్మావతారాలు

బ్రహ్మ చెబుతున్నాడు నారదుడికి.నారదా!వైవస్వత మనువు కాలంలో యుగము అంతము అయింది.అప్పుడు జలప్రళయము సంభవించింది.అప్పుడు విష్ణువు విచిత్రమయిన మత్స్యరూపము ధరించాడు.ఆ చేప రోజు రోజుకు పెరుగుతూ,చాలా స్వల్ప వ్యవథిలో బ్రహ్మాండంగా పెరిగింది.ఆ చేప సృష్టి అంతరించకుండా కాపాడింది.సృష్టికి ఆధారములు అయిన వస్తువులు,జీవరాశులులో నిండి,ఆ మనువు ఎక్కి ఉండే నావ మునిగి పోకుండా కాపాడింది. ఆ సమయంలో నానుంచి వేదాలను రాక్షసులు అపహరించి ఉన్నారు.దేవతల ప్రార్థన మేరకు ఆ వేదములును తిరిగి నాకు అప్పగించింది. ఇది మత్స్యావతార కథ. ఒకానొకప్పుడు దేవతలు,దానవులు అమృతము కోసము కష్టపడ్డారు.మంధర పర్వతాన్ని కవ్వములాగా చేసుకున్నారు.వాసుకిని కవ్వము చిలికేదానికి వాడే త్రాడు లాగా కట్టారు.పాల సముద్రాన్ని ఏక బిగిన చిలకటం మొదలుపెట్టారు చెరొక ప్రక్కన నిలబడి.కొంచెం సేపటికి ఆ పర్వతము మునిగి పోబోయింది.అప్పుడు భగవంతుడు కూర్మరూపంలో సముద్రం అడుగుకు వెళ్ళి,కవ్వము మునిగిపోకుండా తన వీపుపై పెట్టుకున్నాడు.ఆ పట్టు ఇచ్చాడు కాబట్టే దానవులు,దేవతలు అమృతము చిలకగలిగారు. ఇది కూర్మావతార కథ.

No comments:

Post a Comment