Friday, 9 January 2026

నృసింహావతార,ఆది మూలావతార కథ

పూర్వము హిరణ్య కశిపుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు.రాక్షస ప్రవృత్తి అంటే ఇంక క్రూరత్వము కరడు గట్టి ఉంటుంది కదా!అతడు గదను ఆయుధముగా చేసుకుని దేవతలను చాలా ఇక్కట్లపాలు చేసాడు.చాలా బాధలు పెట్టాడు.స్వర్గము ఛిందరవందరమయింది.ఎక్కడ చూసినా కల్లోలమూ,భీభత్సమే!అప్పుడు అసుర సంహారము కోసము శ్రీమహా విష్ణువు నృసింహ రూపం ధరించాడు. ఇల్లూ వాకిలీ కాకుండా గడప పైన కూర్చుని,పగలూ రాత్రి కాకుండా అసుర సంధ్య వేళలో,ఏ అస్త్ర శస్త్రాలు వాడకుండా తన గోళ్ళతో ఆ దుష్టుడిని చీల్చి చంపాడు.ఈ కార్యంతో ముల్లోకాలకూ మేలు చేసాడు.అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేలా చేసాడు.ఇది నృసింహావతార కథ. గజేంద్రుడు ఒకసారి నీటికోసరం మడుగులోకి దిగాడు.అప్పుడు ఒక మొసలి దాని కాలును నోట పట్టుకుంది.అప్పుడు ఆ గజేంద్రుడు ఆ మొసలి తో వేయి ఏండ్లు పోరాడాడు దాని పట్టు నుంచి విడిపించుకునేదానికి.కానీ తన శక్తి యుక్తులు చాలలేదు.అప్పుడు గజేంద్రుడు శ్రీహరిని శరణు కోరాడు.లావొక్కింతయు లేదు,ధైర్యము విలోలంబయ్యే.....అంటూ. అప్పుడు శ్రీమన్నారాయణుడు శ్రీలక్ష్మిని వదలి,వైకుంఠపురాన్ని వదలి,పై పంచే జారి పోతున్నా పట్టించుకోకుండా పరుగులు తీసాడు భక్తుడిని రక్షించేదానికి.తన విష్ణు చక్రంతో మొసలిని తుదముట్టించి గజేంద్రుడిని కాపాడాడు. ఇది శ్రీమహా విష్ణువు యొక్క ఆదిమూలావతారము.

No comments:

Post a Comment