Sunday, 4 January 2026

ధృవుడు,పృథుడు

ధృవుడు ఉత్తానపాదుడు అనే రాజుకు పుత్రుడు.అతను విష్ణువు అంశతో జన్మించాడు.అతని చిన్న వయసులో తండ్రి ఒళ్ళోకూర్చోబోయాడు.సవతి తల్లికి ఒప్పలేదు.తండ్రి తొడపై కూర్చుని,మురిపాలు పోవాలి అనే ఆ చిన్న బాలుడి కోర్కె తీరని కోరికే అయింది.ఆ సవతి తల్లి మాటలు ఆ చిన్నారి గుండెల్లో గునపాల్లా గ్రుచ్చుకున్నాయి.మానవుల ప్రేమలు సమంగా ఉండవు.భగవంతుడే సర్వకాల సర్వావస్థలయందు అందరినీ సమంగా ప్రేమిస్తాడు అని కన్న తల్లి చెప్పింది.ఎవరైతే తనను తననుగా ప్రేమిస్తారో,వారి ప్రేమ పొందితే చాలు అని తల్లి చెప్పిన మాటలు తలకెక్కాయి.అంతట తక్షణం ఆ పరమాత్ముడిని అన్వేషిస్తూ కానలకెళ్ళాడు. అడవిలో విష్ణువు కోసం ఘోర తపస్సు చేసాడు.ఆ భగవంతుడు అతనికి అత్యున్నతమయిన ధృవ స్థానం కల్పించాడు.భృగువు,మిగిలిన మునులు అతనిని స్తుతించారు.ధృవ మండలము సప్తర్షి మండలానికి పైభాగాన ఉంటుంది.ఇది ధృవావతార కథ. మునుపు వేనుడు అని ఒక రాజు ఉన్నాడు.భలే కృూరుడు.దుష్ట ప్రవర్తనకు తగినట్లుగా అతనికి బ్రాహ్మణ శాపం తగిలింది.దాని దెబ్బకు భాగ్యము అంతా పోయింది.ధనంతోటే పౌరుషము కూడా కనుమరుగు అవుతుంది కదా! పృథువు ఆ వేనుని పుత్రుడు.తండ్రి దుష్ట బుద్ధి ఇసుమంతకూడా అంటలేదు.అతను లోకములకు హితము కూర్చిన మహనీయుడు.ఇతను కూడా విష్ణు అంశతో పుట్టాడు.చక్రవర్తి అయ్యాడు.ఇతను భూమిని గోవుగా చేసాడు.సమస్త వస్తువులను పిదికాడు.పుత్రుడుగా తన ధర్మం నిర్వర్తించాడు.తండ్రికి ఉత్తమ గతి కల్పించాడు. ఇది పృథువు అవతార కథ.

No comments:

Post a Comment