Saturday, 28 March 2026
శ్రీకృష్ణుడు శత్రు సంహారం ,మిత్ర సహకారం
శ్రీకృష్ణుడి లీలలు ఒకటా,రెండా?చెప్పుకుంటూ పోతుంటే వస్తూనే ఉంటాయి.మనం అలసి పోవాలి అంతే!శ్రీకృష్ణుడు నరకుడిని చంపిన తరువాత అతని చెరలో ఉన్న పదహారు వేల రాజకన్యలను విడిపించాడు.వారి ప్రార్థనపై వారందరినీ వివాహం చేసుకున్నాడు.కాలయవన,సాళ్వ,జరాసంథులు చతురంగబలాలతో వచ్చి మథురను చుట్టుముట్టాయి.వాళ్ళందరినీ సంహరించాడు.పాండవులు ఎప్పుడూ శ్రీకృష్ణుడిని నమ్ముకోని ఉన్నారు.వాళ్ళకు విజయం చేకూరేలా సహాయం చేసాడు.అలా కూడా శత్రు సంహారం అయింది.బలరాముడితో కలసి బాణుడు,శంబరుడు,మురుడు,పల్వలుడు మున్నగు రాక్షసులను చంపాడు.దంత వక్త్రుడు అనే రాక్షసుడిని యుద్ధంలో చంపాడు.అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఉపయోగించి పాండవ నాశనంకు ఒడి కట్టాడు.అప్పుడు ఉత్తర గర్భంలో బిడ్డ బ్రతికి బట్ట కట్టేలా చేసాడు.పాండవుల వంశం నిలబెట్టి వారికి మహోపకారం చేసాడు.తరువాత కాలంలో ఆ బిడ్డ పరీక్షిత్తుగా గొప్ప పేరు తెచ్చుకునినాడు.శ్రీకృష్ణుడు లౌకిక,వైదిక మార్గములను నడుపుతూ నిస్సంగుడైనాడు.ద్వారకానగరంలో సుఖముగా కాలం గడిపాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment