Monday, 23 March 2026

గోపికాలోలుని గొప్పదనం

శ్రీకృష్ణుడు తన వేణుగానంతో బృందావనంలో గోపికల మనసులు దోచుకున్నాడు.అంతేనా?వలువలూ దోచుకున్నాడు.వారికి మోక్షం కలిగించేదానికి.ఆ రాసక్రీడలలో రేపల్లె తడిసి ముద్దయి పోయింది.పెద్దా చిన్నా అనిలేకుండా ఆ మాథవుడు అందరినీ అలరించాడు.అందరి మనసులూ చూరగొన్నాడు.బలరాముడితో కలసి మధురా పట్టణానికి పయనమయ్యాడు.అక్కడ కంసుని సంహారం చేసాడు.తల్లిదండ్రులను చెరనుంచి విడిపించాడు.సాందీపునికి శిష్యుడు అయినాడు.వేదవేదాంగములను,అరువది నాలుగు విద్యలనూ గ్రహించాడు.ప్రభాస తీర్థమునకు పోయి సముద్రములో మునిగిపోయి మరణించిన గురుపుత్రుని బ్రతికించి తీసుకుని వచ్చాడు.అలా గురువుకు గురుదక్షిణ ఇచ్చాడు.ఎదిరించిన రాజులను అందరినీ తరిమి భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణిని వివాహము చేసుకున్నాడు.నగ్నజిత్తు అనే రాజు తన దగ్గర ఉన్న పొగరెక్కిన సప్త వృషభములను ఎవరు లొంగదీస్తారో వారికి తన కూతురును ఇచ్చి పెళ్ళి చేస్తానన్నాడు.ఎవరికీ వల్లగాలేదు.అప్పుడు శ్రీకృష్ణుడు వాటిని లొంగదీసుకుని నాగ్నజితిని పెండ్లాడాడు.సత్యభామ కోరిక మేర దేవతలను ఓడించి పారిజాత వృక్షాన్ని భూమికి తీసుకుని వచ్చాడు.నరకాసురుడు భూదేవికి పుత్రుడు.లోక కంటకుడు అయిన అతనిని తన చక్రంతో సంహరించాడు.ఆ పైన అతని కొడుకుకు రాజ్యాభిషేకం చేసాడు.

No comments:

Post a Comment