Tuesday, 14 October 2025

అశ్వత్థామ ఘాతుకం

సూతుడు శౌనకాది మునులకు మాట ఇచ్చాడు.ఏమని?వారికి పరీక్షిత్తు మహారాజు వృత్తాంతము,పాండవుల మహా ప్రస్థానము మరియు శ్రీకృష్ణుని వృత్తాంతము చెబుతాను అని.ఇలా మొదలు పెట్టాడు అన్నట్టుగానే. మునులారా!కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధంలో కౌరవ వీరులు అందరూ గతించారు.పాండవుల పక్షంనుంచి కూడా చాలా మంది విగతజీవులు అయ్యారు.భీముడు గదాఘాతం వలన దుర్యోధనుడి తొడలు విరిగి పోయాయి.విజయలక్ష్మి పాండవులను వరించింది. దుర్యోధనుడి దీన స్ధితి చూసి అశ్వత్థామ చాలా బాథ పడ్డాడు.దుర్యోధనుడికి సంతోషం కలగాలంటే ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నాడు.అర్థరాత్రి వెళ్ళి,నిద్రలో ఉన్న ఉపపాండవులను దొంగచాటుగా చంపేసాడు.ఆ సమయంలో అందరూ నిద్రలు పోతున్నారు.అప్పుడు ఇలాంటి ఘాతుకం చేబట్టాడు ద్రోణ పుత్రుడు అయిన అశ్వత్థామ.విషయం అందరికీ తెలిసి పోయింది.ద్రౌపది దుంఖాన్ని ఆపేవారే లేకపోయారు.అంత హృదయవికారంగా రోదించింది. అప్పుడు అర్జునుడు ఆమె దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు.నీవు శోకించవద్దు.నీవు రాజపుత్రివి.నీకు తగదు.అశ్వత్థామ కరుణ అనే మాట లేకుండా,నిద్రలో ఉండే బాలురను చంపాడు.నేను వెళ్ళి అతనిని చంపి,అతని తలను నీకు కానుకగా ఇస్తాను.నీవు నీ కసి,కోపం పోయేదాకా కాళ్ళతో అతని తలను తన్ను. కృష్ణుడు కూడా అదే సరైనది అని అన్నాడు.

No comments:

Post a Comment