Sunday, 12 April 2026
ఉద్ధవుని భక్తి ప్రపత్తులు
మైత్రేయుడు తీర్థయాత్రలు చేస్తూ శ్రీకృష్ణుడు ఉన్న చెట్టు మొదలు దగ్గరకు వచ్చాడు.అప్పుడు శ్రీకృష్ణుడు మైత్రేయుడు వింటుండగా ఉద్ధవుడితో ఇలా అన్నాడు.నాయనా!ఉద్ధవా!నీ పూర్వజన్మ వృత్తాంతం చెబుతా విను.నీవు నీ పూర్వజన్మలో వసుబ్రహ్మలు చేసిన సత్రయాగములో ఒక వసువుగా ఉన్నావు.నీ మనస్సులో ఏమీ కోరికలు లేవు నా పాదారవిందాలు సేవించుకోవాలనే తృష్ణ తప్ప.అందుకనే నేను ఎప్పుడూ నీ మనసులోనే నివసిస్తూ ఉంటాను.నీకు ఇంక మరో జన్మ లేదు.నీవు గొప్ప పుణ్యాత్ముడివి.ఇంకో సంగతి కూడా చెబుతా విను.పద్మకల్పము నందు నా నాభీ పద్మమునందు ఉద్భవించు బ్రహ్మకు నా మహత్త్వము నెరిగించు దివ్య జ్ఞానాన్ని నీకు ఇస్తాను.అలా ఆ జ్ఞానాన్ని నాకు ఆ కృష్ణ పరమాత్ముడు ఉపదేశించాడు.కాబట్టి ఆయన ఆనతి మేరకు నేను కల్పాంతము వరకూ ఉండవలసి వస్తుంది.నేను ఇప్పుడు బదరికాశ్రమమునకు పోవుచున్నాను.
ఉద్ధవుడు చెప్పిన మాటలకు విదురుడు దిగులు పడ్డాడు.యాదవ వినాశనము అతనిని కలవర పరచింది.కానీ నిజయోగ సత్త్వమున శోకాన్ని విడనాడాడు.ఉద్ధవుడిని ప్రార్థించాడు.ఓ యాదవోత్తమా!శ్రీకృష్ణుడు నీకు పరతత్త్వము గురించి చెప్పాడు అన్నావు కదా!నాకు కూడా అది బోధించు.నన్ను కూడా కృతార్థుడిని చేయి.మీరు భగవద్భక్తులు,సుజనులు.మీరు మహనీయులు,పరోపకార పరాయణులు.నా మొర ఆలకించండి అని వేడుకున్నాడు.
అప్పుడు ఉద్ధవుడు విదురుడితో ఇలా అన్నాడు.విదురా!మునిసత్తముడు,విష్ణు సమానుడు అయిన మైత్రేయుడు నీకు ఆ తత్త్వమును బోథిస్తాడు అని చెప్పి బదరీవనమునకు బయలుదేరాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment