Friday, 12 September 2025

కథ మొదలు పెడదామా ఇంక

లోకములోని అన్ని అరణ్యాయలలోకీ నైమిశారణ్యము చాలా ప్రముఖమైనది.ప్రాశస్త్యము కలది.ఉత్తమమైనది కూడా!అక్కడ ఉండే అన్ని వృక్షాలు ఎప్పుడూ కళకళలాడుతుంటాయి.ఎప్పుడూ పూలతోను,రసభరిత పళ్ళతోనూ నిండి ఉంటాయి.రకరకాల హరిత వర్ణాలతో అక్కడ ఉండే చెట్లు అన్నీ శోభాయమానంగా కనువిందులు చేస్తుంటాయి.అక్కడ చాలా మంది మునులు తమ తమ స్థిర నివాసాలు ఏర్పరుచుకుని ఉంటారు.కాబట్టి జనులు,పురప్రజలు సంతోషంగా వారిని చూసి తరించేదానికి వస్తుంటారు. అక్కడ ఇంకో తమాషాకూడా మనం చూడగలతాము.మామూలుగా కృూరమృగాలు సాథుజంతువులను వేటాడుతుంటాయి కదా!కానీ ఇక్కడ అన్నీ ఆలాజాలంగా,సఖ్యంగా,సామరస్యంగా కలసిమెలసి ఉంటుంటాయి.వాటి మధ్య విరోథభావాలు మచ్చుకికి కూడా కనిపించవు.ఐక్యమత్యంగా,హాయిగా,చెట్టాపట్చాలేసుకుని తిరుగుతుంటాయి.దీనికంతటికీ కారణం ఏమనుకుంటున్నారు మీరు?నేను చెప్పనా!ఇంగిత జ్ఞానము లేని జంతువులు కూడా మహామునుల ప్రభావం చేత జాతివైరం మాని,సాథ్యమైనంతగా సాధుజీవితానికి,సఖ్యతకి,సామరస్యానికీ పెద్ద పీట వేసాయి.ఇంతేనా!కాదు,కాదు.ఆ మునులు లాగా ఈశ్వర ధ్యానం చేసుకుంటూ కానవస్తాయి.ఎంత గొప్ప కదా!

No comments:

Post a Comment