ఆ నైమిశారణ్యంలో ఉండే మునులు గొప్ప విద్వాంసులు.వారికి సమస్త శాస్త్రాలూ క్షుణ్ణంగా తెలుసు.కాబట్టి వారికి శుశ్రూష చేసుకోవాలి అనే ఇచ్ఛతో నలుమూలల నుంచి,అనేక ప్రాంతాల నుండి వేల సంఖ్యలో శిష్యులు వస్తూ ఉంటారు.వారి ఆశ ఏందంటే ఆ మునులు వీరిని మెచ్చి,వారికి తెలిసిన సమస్త శాస్త్రాలు,పురాణాలు వీరికి నేర్పిస్తారని!ఆ మునులు కూడా రాగ ద్వేషాలకు అతీతంగా,శిష్యులు కోరిన అన్ని విద్యలూ నేర్పిస్తుంటారు.అక్కడ అందరూ సఖ్యంగా,సామరస్యంగా ఉంటూ భగవద్థ్యానము చేసుకుంటూ ఉంటారు.ఎప్పుడూ ఏదో ఒక యజ్ఞమో,యాగమో చేసుకుంటూ ఉంటారు.ఇలా నైమిశారణ్యము ఎప్పుడూ కళ కళలాడుతూ ఉంటుంది.
No comments:
Post a Comment