Thursday, 1 January 2026
కపిలుడు,దత్తాత్రేయుడు
కర్దమ ప్రజాపతికి,దేవహూతికి తొమ్మిది మంది సోదరీమణులతో కలిపి కపిలుడు జన్మించాడు.సాంఖ్య యోగము అనేది భగవంతుడు అయిన శ్రీహరిని పొందేదానికి అనువైన మార్గము.ఆ సాంఖ్య యోగాన్ని తన తల్లికి ఉపదేశించాడు.పాప ప్రక్షాళన ఎలా చేసుకోవాలి విశదీకరించాడు.ఆ పై ముక్తిని పొందే మార్గము బోధించాడు.ఇది కపిలావతార కథ.
అత్రి మహాముని తపస్వులలోకి ఉత్తముడు.అతను పుత్రుడు కావాలని శ్రీహరిని ప్రార్థించాడు.ఆ భగవంతుడు నేను నీకు దత్తుడను అంటూ అత్రి మహామునికి కొడుకుగా పుట్టాడు.అతడే దత్తాత్రేయుడు.దత్తుడు అయిన శ్రీహరి అత్రి మహామునికి పుత్రుడు అయినాడు కాబట్టి ఆత్రేయుడు అయినాడు.హరికి దత్తాత్రేయ నామము కలిగే దానికి ఇదే కారణము.
దత్తాత్రేయుడి పాద ధూళితో హైహయ వంశీయులు,యాదవులు పవిత్రులు అయినారు.వారందరూ ఐహిక సుఖాలను అనుభవించారు.అలాగే పరలోక సుఖాలనూ ఆస్వాదించారు.ఇది దత్తాత్రేయావతార కథ.
Subscribe to:
Comments (Atom)